Vijayasai Reddy: విజ‌య‌సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..ఏ క్ష‌ణమైనా అరెస్ట్‌?

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలక నాయకులు, వైసిపి మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా విజయసాయి రెడ్డికి ఈడి నోటీసులు జారీ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక విషయాలు రాబట్టేందుకుగాను విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. Vijayasai Reddy

Vijayasai Reddy ed notices today ap liquor case

ఈ నెల 22వ తేదీన ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులలో ఈడి వెల్లడించింది. మద్యం సరఫరా దారులు, మిస్టరీల నుంచి విజయసాయిరెడ్డికి భారీగా ముడుపులు ఉంటాయని అలాగే నగదును మనీలాండరింగ్ ద్వారా వేరే ఖాతాలకు ఆయన మళ్లించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి తాజాగా మరోసారి ఈడి నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇంకా విజయసాయిరెడ్డి స్పందించలేదు. Vijayasai Reddy

Also Read: kavitha: ఆ మీడియా ఛానల్ పై కన్నేసిన దేవనపల్లి కవిత ?

ఈ విచారణకు హాజరు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఏపీ రాజకీయాలను ఏలారు విజయసాయిరెడ్డి. కానీ, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత రాజకీయాలతో పాటు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ తన ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు విజయసాయిరెడ్డి. త్వరలోనే ఆయన మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు. Vijayasai Reddy

Also Read: BRS: మీకిదే చివరి అవకాశం ఇస్తున్నాను..స్పీక‌ర్ కు బిగ్ షాక్‌!

Share your love