
Vijayasai Reddy: రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం హిందూ ధర్మం అంటూ జపం చేస్తున్నారు. క్రైస్తవ మతానికి చెందిన జగన్ పార్టీలో ఎన్ని రోజులపాటు ఉన్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. Vijayasai Reddy
Vijayasai Reddy into bjp party news viral
హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంచలన పోస్ట్ పెట్టారు విజయసాయిరెడ్డి. దీంతో విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు అంటూ తాజాగా పోస్ట్ పెట్టారు విజయసాయిరెడ్డి. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అలాంటి వారిని తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామంటూ పిలుపునిచ్చారు. Vijayasai Reddy
Also Read: KCR: కేసీఆర్ ఒక్క కామెంట్…గులాబీ పార్టీకి ఆక్సిజన్, ఇక దూకుడే
గత పది సంవత్సరాలలో జరిగిన మతం మార్పిడిలపై కమిటీ వేయాలంటూ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తున్నారు విజయ్ సాయి రెడ్డి.
దేశం కోసం ధర్మం కోసం హిందువులు ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒకటి కావాలని వెల్లడించారు. ఇదే భారతదేశానికి రక్ష.. శ్రీరామరక్ష అంటూ వ్యాఖ్యానించారు. దీంతో విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. Vijayasai Reddy
Also Read: IndiGo cancellations: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడును అవమానించిన టీడీపీ ?





