

AP Liquor: ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సంక్రాంతి పండుగ దగ్గర పడిన నేపథ్యంలో మద్యం ధరలను భారీగా పెంచుతూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కో బాటిల్ పై ఏకంగా 10 రూపాయలు పెంచుతున్నట్లు తాజాగా కీలక ప్రకటన చేసింది కూటమి సర్కార్. AP Liquor
AP Liquor prices hiked
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నాణ్యమైన మందు అందిస్తున్నట్లు పదేపదే టిడిపి నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి సమయంలో ఉన్న లిక్కర్ బ్రాండ్లు అన్నిటిని క్లోజ్ చేశారట. కింగ్ఫిషర్ బీర్లు ఏపీలో విచ్చలవిడిగా దొరుకుతున్నట్లు చెబుతున్నారు. నాణ్యమైన అందిస్తున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కూడా కొంతమంది మందుబాబులు కురిపించారు. అయితే ఇది మరవక ముందే మందు బాబులపై చంద్రబాబు నాయుడు భారం వేసేందుకు సిద్ధమయ్యారు. AP Liquor
Also Read: Sampath Kumar: 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం..వివాదంలో కాంగ్రెస్ నేత ?
సంక్రాంతికి మరో రెండు రోజులు ఉండగానే మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అన్ని రకాల మద్యం బాటిల్స్ పై పది రూపాయలు పెంచుతూ ప్రకటన చేసింది. రిటైలర్ల మార్జిన్ లో ఒక శాతం పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో మందుబాబులు లబోదిబోమంటున్నారు. AP Liquor
Also Read: Congress: 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా చేయండి ?







