YCP: ఆంధ్రజ్యోతిని దారుణంగా ట్రోల్ చేసిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు !

YCP
YCP

YCP: ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ను దారుణంగా వైసిపి కార్యకర్తలు ట్రోలింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో భాగంగా, నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. YCP

YCP activists trolled Andhra Jyothi brutally

ఇందులో భాగంగానే తాడేపల్లిలో ప్రత్యేక విమానం ఎక్కిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు చాలా మంది అభిమానులు వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనాలు విమానాశ్రయం దగ్గర సందడి చేశారు. అటు నాంపల్లి కోర్టు వరకు కూడా జగన్మోహన్ రెడ్డితో జనాలు వచ్చారు. YCP

Also Read: KCR: “గద్ద ముక్కు” అంటూ కేసీఆర్ పై రెచ్చిపోయిన ఏపీ మంత్రి.. BRS అదిరిపోయే…

అయితే ఇది కవర్ చేసేందుకు ఆంధ్రజ్యోతి ఛానల్ కు సంబంధించిన మినీ వ్యాన్ వచ్చింది. ఆ ఛానల్ ను ఉద్దేశించి వైసిపి కార్యకర్తలు ట్రోలింగ్ చేశారు. జనాలు లేని దగ్గర కవర్ చేసి మీ ఛానల్ లో పెట్టుకోండి.. ఇక్కడ జనాలు జగన్ కోసం భారీ స్థాయిలో వచ్చారు అంటూ దారుణంగా ఆడుకున్నారు. దీంతో అక్కడి నుంచి వ్యాన్ వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. YCP

Also Read: YS Jagan: హైద‌రాబాద్ లో జ‌గ‌న్ ఎంట్రీ..రప్పా రప్పా పోస్ట‌ర్ల క‌ల‌క‌లం

https://www.facebook.com/share/r/1DWQKYNStH

Share your love