
Global Summit 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సదస్సు జరిగిన రెండు రోజుల్లోనే దాదాపు 5 లక్షల 75 వేల కోట్ల విలువైన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. Global Summit 2025
BRS Trolls on Telangana Rising Global Summit 2025
2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న ముఖ్య లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. అయితే ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం పై గులాబీ పార్టీ దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది. గడిచిన 10 సంవత్సరాల గులాబీ పార్టీ అభివృద్ధి కారణంగానే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేస్తోంది కెసిఆర్ సోషల్ మీడియా. Global Summit 2025
Also Read: Donald Trump: ట్యాక్స్లు వేసి, టారిఫ్లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా?
అంతేకాదు ఈ గ్లోబల్ సబ్మిట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును వృధా చేస్తుందని మండిపడుతోంది. తెలంగాణ మంత్రులు తాగే వాటర్ బాటిల్ ఖర్చు కూడా సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా వైరల్ చేస్తోంది. బట్టి విక్రమార్క తో పాటు తెలంగాణ మంత్రులు తాగే వాటర్ బాటిల్ ధర దాదాపు 3500 ఉంటుందట. దీనికి సంబంధించిన ఫోటోను వైరల్ చేస్తున్నారు. Global Summit 2025
Also Read: CM Revanth Reddy: పగిలిన టైర్.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కు తప్పిన ప్రమాదం…





