

Telangana Thalli: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గ్లోబల్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యం తో ఈ సదస్సు నిర్వహించారు. అయితే ఈవెంట్ హైదరాబాద్ అవతల నిర్వహించింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికోసం చాలానే ఖర్చు పెట్టారు. దానికి తగ్గట్టుగానే తెలంగాణకు పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈవెంట్ పూర్తయి దాదాపు వారం రోజులు అయిపోయింది. Telangana Thalli
Telangana Thalli brs trolls on telangana global summmit
ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సదస్సు నిర్వహించిన చోట ఉన్న టెంపుల్ అన్ని పీకేశారు. కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విగ్రహం మాత్రమే మిగిలి ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గులాబీ పార్టీ సోషల్ మీడియా ఒక ఆట ఆడుకుంటోంది. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ పోస్టులు పెడుతోంది. “డేరా నగర్” పీకేసిండ్రు! కాంగ్రెస్ తల్లిని రోడ్డున పడేసిన రేవంత్! అంటూ బీఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆడుకుంటోంది. Telangana Thalli
Also Read: Kadiyam Srihari: స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరికి జనాలు షాక్ ?
ఫోర్త్ సిటీ పేరుమీద రియల్ ఎస్టేట్ దందా కోసం గ్లోబల్ సమ్మిట్ పెట్టి కేవలం టెంట్లకే వంద కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అంటూ ట్రోల్ చేస్తున్నారు. రెండు రోజుల తమాషా కోసం ఇళ్లు పీకి పందిరి వేసిన రేవంత్! అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. రైతులకు, పేదలకు, మహిళలకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడానికి పైసా లేదు అనే రేవంత్, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాల కోసం వందల కోట్లు తగలేస్తున్నాడు! అంటూ పోస్టులు పెడుతున్నారు. Telangana Thalli
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ..టీడీపీ కార్యకర్తల దాష్టీకం







