Mahbubabad: నీళ్ల కోసం రోడ్డెక్కిన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్‌లో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు నీటి కోసం రోడ్డు ఎక్కి నిరసన తెలిపారు. గత నెల రోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

Water Crisis School Girls Protest

ఉదయం లేచిన వెంటనే వాష్రూం వెళ్లడానికి కూడా నీళ్లు లేవని, బాత్రూంలో శుభ్రం చేసుకోవడానికి కూడా నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని విద్యార్థినులు చెప్పారు. ఈ సమస్య స్కూల్ యాజమాన్యానికి చెప్పినా వినిపించుకోలేదని, ప్రధానోపాధ్యాయుడు వ్యక్తికి పది రూపాయల చొప్పున ఇస్తే మీటర్ రిపేర్ చేయిస్తానని చెప్పినట్లుగా తెలిపారు. సమస్య చెప్పినప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులను వేధిస్తున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి విద్యార్థినుల చదువుపై ప్రభావం చూపిస్తోందని, వారు శారీరకంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సదుపాయం కల్పించాలి అని వారు వెంటనే డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.

స్థానిక అధికారులతో పాటు పాఠశాల యాజమాన్యం స్పందించి, వెంటనే సమస్యను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. నీటి సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, యంత్రాంగం త్వరితగతిన స్పందించాలి అని నిరసనకారులు కోరారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని స్కూల్ విద్యార్థుల సమస్యలను మరోసారి హైలైట్ చేస్తుంది.

Share your love