మాజీ కోచ్ రవిశాస్త్రి 2027 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించాడు. ఇందులో అనుభవం ఉన్న పేసర్లు మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్లకు ప్రాధాన్యత ఇచ్చాడు. సౌతాఫ్రికా వంటి కండిషన్స్లో రాణించాలంటే పాత ప్లేయర్లు చాలా ముఖ్యమని శాస్త్రి చెప్పాడు.
Ravi Shastri’s World Cup picks
గతంలో వన్డేలకు దూరంగా ఉన్న షమీ, భువీలను తిరిగి తీసుకురావడానికి కారణం ఏంటంటే, మెగా టోర్నీల్లో అనుభవమే కీలకం. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో టీమిండియా చెత్త బౌలింగ్తో ఓడిపోయింది. అందుకే పాత పేసర్లతో కాంబినేషన్ మార్చాలని శాస్త్రి సూచించాడు.
శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉండే ఈ 15 మంది స్క్వాడ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఉన్నారు. బుమ్రా, సిరాజ్, అర్ష్దీప్ సింగ్ కూడా ఉన్నారు. హార్దిక్, జడేజా, అక్షర్ ఆల్రౌండర్లు. కుల్దీప్ స్పెషలిస్ట్ స్పిన్నర్.
శాస్త్రి ఎంచుకున్న జట్టులో 10 మంది 2019 ప్రపంచకప్ ఆడిన వారే. కేవలం అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ మాత్రమే కొత్తవారు. ముందు టోర్నీ అనుభవం ఉంటేనే విజయం సాధించడం ఈజీ అవుతుందని రవిశాస్త్రి అభిప్రాయం.





Shreyas Iyer: శ్రేయాస్ కీలక వ్యాఖ్యలు – వైభవ్ గురించి ఏమన్నాడంటే?