RCB selection: టీ20 జట్టులో RCB ఆటగాళ్లకు ఎందుకు న్యాయం జరగడం లేదు?

టీమిండియా టీ20 సెలక్షన్లో RCB ఆటగాళ్లకు న్యాయం జరగడం లేదని మాజీ ఓపెనర్ సదగోపన్ రమేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వరుసగా రెండు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన RCB నుంచి ఒక్క ప్లేయర్ కూడా జింబాబ్వే సిరీస్కి ఎంపిక కాకపోవడంపై ఆయన షాక్ అయ్యారు. ఆర్సీబీ సెలెక్షన్ విషయంలో సెలక్టర్లు వివక్ష చూపిస్తున్నారని, అడిగితే ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగానే టీ20 జట్టు ఎంపిక చేస్తున్నామంటున్నారు కానీ అది కొందరికి మాత్రమే వర్తిస్తోందని రమేష్ ఆరోపించాడు.

RCB Selection Bias in Team India

ఈ సెలక్షన్ ప్రక్రియలో డబుల్ స్టాండర్డ్ కనిపిస్తోందని రమేష్ చెప్పాడు. ప్రస్తుత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీలను ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే సెలెక్ట్ చేశారు. కానీ RCB నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2026లో రెండో భాగంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రవి బిష్ణోయ్కి భారత తుది జట్టులో చోటు దక్కడం మరో విచిత్రం. అలాగే ఒక ఓవర్ కూడా బౌలింగ్ చేయని సూర్యన్ష్ షెడ్గే ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చాడు. ఇలా కొందరికి మాత్రమే ఐపీఎల్ ప్రదర్శనలను కొలమానంగా తీసుకుంటున్నారని రమేష్ మండిపడ్డాడు.

పర్పుల్ క్యాప్ రేసులో టాప్-10లో నిలిచిన ఐదుగురు భారత బౌలర్లలో RCB పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నాడు. అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్, రసిక్ సలామ్ దార్, కార్తీక్ త్యాగి వంటి వాళ్లు అద్భుత ప్రదర్శనలు కనబరిచినా ఎవరూ ఎంపిక కాలేదు. బదులుగా ఒక్క వికెట్ కూడా తీయని మయాంక్ యాదవ్కు అవకాశం దక్కింది. 2024 తర్వాత ఆడిన 6 మ్యాచ్లలో ఆకట్టుకోలేదు కూడా. ఇలా సెలక్షన్ పూర్తిగా పొలిటికల్ గా మారిందని సదగోపన్ విమర్శించాడు.

104 మంది ఏక వికెట్ తీసిన బౌలర్లలో టాప్-10లో RCB బౌలర్లు ఐదుగురు ఉండటం గమనార్హం. 47వ స్థానంలో హర్షదూబే, 55వ స్థానంలో అశోక్ శర్మ, 89వ స్థానంలో యశ్ ఠాకూర్కి సెలెక్ట్ అయితే.. వీళ్లకు ఛాన్స్ రాలేదు. వయసు కారణంగా భువీని తీసుకోవడం లేదు, విశ్రాంతి పేరుతో సిరాజ్ని సైడ్ చేశారు. నిజానికి RCB ప్లేయర్ల ప్రదర్శనలను పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. ఇది టీ20 సెలక్షన్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడాన్ని సూచిస్తోంది.

Share your love