basavatarakam hospital ప్రభుత్వ సబ్సిడీలు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. బసవతారకం హాస్పిటల్లో చికిత్స పొందిన ఓ రోగి పిటిషన్ప� విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Basavatarakam Hospital Free Treatment
రొమ్ము క్యాన్సర్ బాధితురాలైన ఆ రోగి ఆరోగ్యశ్రీ పథకం కిందికి రాదని, అన్ని ఖర్చులు ఆమెనే భరించాలని హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ వాదనను తప్పుబట్టి, హాస్పిటల్ ప్రభుత్వ భూమిని సబ్సిడీపై పొందిందని, అందుకే పేదలకు ఉచిత చికిత్స అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.
హైకోర్టు తన తీర్పులో పిటిషనర్ చికిత్సలో ఆలస్యం జరిగితే హాస్పిటల్పై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని అవసరమైన అన్ని చికిత్సలు అందించాలని ఆదేశించింది. ఈ తీర్పు ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్కు కూడా ఓ సంకేతంగా నిలిచింది.
Source: @TeluguScribe on X

