Congress: కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం?

Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్, పార్టీ నేతల గొడవలతో హై కమాండ్ తల పట్టుకుంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ మధ్య వాడు కొనసాగిన సంగతి తెలిసిందే. దళిత మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ ని దున్నపోతు అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. Congress

Dispute between two more ministers in the Congress party

దీంతో ఈ వివాదం దుమారం రేపుతోంది. ఇప్పుడిప్పుడే ఈ వివాదం స‌ద్దుమ‌నుగుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ లో మరో వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ మహిళా మంత్రి హోండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వార్ కొనసాగుతోందట. ఈ పంచాయతీ రేవంత్ రెడ్డి దాకా వచ్చినట్లు చెబుతున్నారు.Congress

Also Read: TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్..చంద్రబాబు, దేవినేని ఉమ ఫోటోల‌తో !

కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింద‌ట‌ కొండా సురేఖ. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుని, రూ.71 కోట్ల టెండర్ ను తన మనుషులకు ఇప్పిస్తున్నాడని కొండా సురేఖ ఫిర్యాదు చేశార‌ట‌. తన దేవాదాయ శాఖలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశార‌ట‌ కొండా సురేఖ. దీంతో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది. Congress

Also Read: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత‌ బొంతు రామ్మోహన్.. సరైన

Share your love