ఆస్తి కోసం బావను కడతేర్చిన బావమరిది.. కుక్క కు ఇచ్చే ఇంజక్షన్స్ తో!!

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఓ సంచలన murder case బయటపడింది. తన సొంత బావమరిదే, ఆస్తి కోసం బావను కుక్కల మందు ఇంజెక్షన్తో హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏవో శ్రీహరి అనే వ్యక్తి, తన బావమరిది హరికృష్ణపై నమ్మకంతో కోట్లాది రూపాయల ఆస్తిని, అప్పుగా డబ్బును కూడా ఇచ్చాడు. కానీ, తర్వాత శ్రీహరి ఆ ఆస్తి తిరుగు ఇవ్వమని కోరడం, హరికృష్ణకు నచ్చలేదు. దీంతో బావను అడ్డు తొలగించాలని ప్లాన్ చేశాడు.

హరికృష్ణ తన బావను జూన్ 15న పెంచలకోనకు దైవదర్శనం పేరుతో కారులో తీసుకెళ్లాడు. తిరుగు దారిలో చేజర్ల మండలం దగ్గర కారు ఆపగానే, అక్కడ ఎదురుచూస్తున్న రవీంద్ర, యానాది అనే ఇద్దరు కూలీలు శ్రీహరిని పట్టుకున్నారు. హరికృష్ణ తన వెంట తెచ్చుకున్న కుక్కలను చంపే ఇంజెక్షన్లను బావకు వేయడంతో, ఆయన అక్కడికక్కడే గుండె ఆగి చనిపోయారు. ఈ murder case లో హరికృష్ణ, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి, మృతదేహాన్ని స్వగ్రామం మినగల్లుకు తీసుకెళ్లాడు.

అయితే, శ్రీహరి శరీరంపై గాయాలను గమనించిన సహోద్యోగులకు అనుమానం వచ్చింది. ఆ సమయంలో కుటుంబం ఫిర్యాదు చేయడంతో నిందితులు మృతదేహాన్ని దహనం చేసి ఆధారాలను తుడిచే ప్రయత్నం చేశారు. కానీ, ఇటీవల హరికృష్ణ మిగిలిన ఆస్తిని తన పేరు రాసివ్వాలని శ్రీహరి భార్య లావణ్యతో గొడవకు దిగడంతో ఆమె అనుమానం పెరిగింది. ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ మొదలైంది.

పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. హత్యకు సహాయం చేసిన రవీంద్ర, యానాదిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ murder case నెల్లూరు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది, ఎందుకంటే ఆస్తి కోసం బావమరిది బావను కుక్కల మందుతో కడతేర్చిన తీరు అందరినీ షాక్కు గురి చేసింది.

Share your love