
Visakha: విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిడ్జిలో దాచిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని ఎల్వీనగర్ ప్రాంతంలో ఉంటున్న నేవీ ఉద్యోగి రవీంద్రకు పెళ్ళై భార్య ఉంది. Visakha
Atrocity in Visakha Man kills girlfriend, cuts her into pieces and hides them in fridge
కానీ, మౌనిక (28) అనే వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇక ఇటీవల మౌనిక డబ్బుల కోసం వేదిస్తుండటంతో భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో తన ప్రియురాలు మౌనిక(28)ను ఇంటికి పిలిచాడు రవీంద్ర. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కత్తితో మౌనికను చంపి, ముక్కలుగా కోసి సగ భాగాన్ని ఫ్రిడ్జిలో ఉంచాడు. మరో సగ భాగం మూట కట్టి ఇంట్లో మూలకు ఉంచి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు రవీంద్ర. Visakha
Also Read: KCR: త్వరలోనే కెసిఆర్ బహిరంగ సభ.. జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్?
డబ్బుల కోసం వేధిస్తుండటంతోనే హత్య చేశానని పోలీసులకు రవీంద్ర వాగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే మౌనిక తల మాత్రం మిస్ అయినట్లు సమాచారం అందుతోంది. Visakha
Also Read: Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా




