
తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు Konda Surekha రాజకీయం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ హైకమాండ్కు మధ్య జరుగుతున్న పరిణామాలు స్టేట్ పాలిటిక్స్లో కొత్త చర్చకు దారితీశాయి. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ అన్నట్టుగా పాలిటిక్స్ మారిపోయాయి.
Konda Surekha Faces Political Heat
కూతురు చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ సమర్థించడంతో పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ బయటపడ్డాయి. పార్టీ లైన్ దాటి వ్యవహరించారంటూ కాంగ్రెస్ లీడర్స్ ఆమెపై సీరియస్ అవుతున్నారు. మరోవైపు, ఆమె ఫ్యామిలీని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ కొందరు ఎమ్మెల్యేలు తీర్మానం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవికి ఆమెకు గండం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది.
ఈ వివాదంలో ఇప్పుడు బీసీ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. వరంగల్ పాలిటిక్స్లో తనను కావాలనే ఓ ‘రెడ్డి లాబీ’ టార్గెట్ చేస్తోందని కొండా సురేఖ ఓపెన్గానే కామెంట్ చేయడం కలకలం రేపింది. ఇదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కూడా ఆమెకు గ్యాప్ పెరిగింది. ఈ ఇష్యూపై ఆమె నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయడం కాంగ్రెస్లో గ్రూప్ పాలిటిక్స్ను బయటపెట్టింది.
మరోవైపు ఈ కాంట్రవర్సీపై వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను పార్టీ పెద్దలు ఆదేశించారు. హైకమాండ్ సీరియస్ కావడంతో ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ ఫైట్ ముదురుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారు, మంత్రి పదవి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్లో బిగ్ క్యూశ్చన్గా మారింది.
👉 ఇంకా చదవండి: Pawan Kalyan: తెలంగాణాలో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్







