


Lionel Messi: కోల్ కతా స్టేడియంలో లియోనెల్ మెస్సికి ఘోర అవమానం ఎదురైంది. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ రద్దు అయింది. మెస్సీ పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో.. వేలాది మంది అభిమానులు కోపంతో ఊగిపోయారు. స్టేడియంలోని సీట్లు ధ్వంసం చేసి..స్టేడియంలో.. వాటర్ బాటిళ్లు విసిరారు లియోనెల్ మెస్సి ఫ్యాన్స్. Lionel Messi
Lionel Messi fans riot at Kolkata Salt Lake Stadium
పరిస్థితి ఉద్రిక్తతం కావడంతో హుటాహుటిన స్టేడియం నుంచి వెళ్లిపోయింది మెస్సీ టీమ్. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఉన్న సొరంగం ద్వారా మెస్సీ బయటకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వస్తున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ లో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ లియోనెల్ మెస్సి మధ్య మ్యాచ్ జరుగనుంది. 7 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మెస్సితో ఫొటోకు రూ.10 లక్షలు ఇవ్వాలనే కండీషన్ పెట్టారు. Lionel Messi
Also Read: Konda Surekha: బస్వరాజు సారయ్య కుట్రలు…కొండా దంపతులను వీడుతున్న నేతలు ?
కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పించారు. ఇప్పటికే 60 మందికి పైగా రూ.10 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లు బుకింగ్ అయ్యాయి. ‘మెస్సితో మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయనతో ఫొటోలు దిగనున్నారు. ఫలక్నుమా ప్యాలెస్లో ఈ కార్యక్రమం జరుగనుంది. నేటి సాయంత్రం హైదరాబాద్ లో మెస్సీ vs సీఎం రేవంత్ మ్యాచ్ అనంతరం ఈ ఫోటో షూట్ ఉండనుంది. ఇక అంతకు ముందు కోల్కతాలో 70 అడుగుల తన విగ్రహాన్ని ఆవిష్కరించారు మెస్సి. షారుక్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. Lionel Messi
Also Read: Kavitha: నేను ముఖ్యమంత్రి అవుతా..కేటీఆర్ ను జైలుకు పంపిస్తా?


















