Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వ్యక్తిగత విషయాల మీద సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. గురువారం ఒక మీడియా ఛానల్ ప్రతినిధితో ముచ్చటించారు. జేబులో 150 పెట్టుకుని హైదరాబాద్ కు వచ్చానని ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, వందేళ్ళ ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. కొంతకాలంలోనే కేసీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నాను.
Revanth Reddy comments on kcr
ఇక కేసిఆర్ వద్ద లాక్కోవడానికి ఏమీ లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పోటీ పడితే స్వాగతిస్తాను నిర్దిష్టమైన ప్రణాళికతో పని చేస్తాను అని అన్నారు. కాంగ్రెస్ లో ఎవరు ప్రత్యర్థులు లేరు అందరూ నాకు సహచరులే అని అన్నారు. ముఖ్యమంత్రిగా నాకు అందరూ గౌరవం ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో పెద్దోడిని కాబట్టి తాను కూడా ఎవరిని బాధ పెట్టేలా మాట్లాడను అని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనక హరీష్ రావు కుట్ర ఉందని అన్నారు.
Also read: Kriti Sanon: కృతి సనన్ వేసుకున్న ఆ రెడ్ బ్రాలెట్ ధర అన్ని లక్షలా..?
అసెంబ్లీలో కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు లాక్కున్నారని కేసీఆర్ రాకపోవడం వలన హరీష్ రావు ఒక్కడికే లాభం జరుగుతుందని అన్నారు. నేనైతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అలానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ కూడా నేను ఇలా ఈ స్థాయికి వెళ్తానని అనుకోలేదు. సీఎం అవుతానని అనుకోలేదు అని అన్నారు జేబులో 150 రూపాయలు పెట్టుకుని హైదరాబాద్ కి వచ్చానని ఏనాడూ కూడా ముఖ్యమంత్రి అవుతారని ఊహించలేదని కలలో కూడా ఊహించలేదని అన్నారు. తెలంగాణకు రెండో సీఎం గా నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని రేవంత్ రెడ్డి అన్నారు (Revanth Reddy).