Siddhu Jonnalagadda: ” ఆ రోజు వరకు ఉంటానో పోతానో తెలియదు”.. సిద్ధూ జొన్నలగడ్డ షాకింగ్ పోస్ట్.!

Siddhu Jonnalagadda shocking post

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ తాజాగా చేసిన ఒక పోస్ట్ సంచలనాలకు తెర లేపింది.అసలు ఈ హీరో ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టారు అని చాలామంది షాక్ అయిపోతున్నారు. అసలు ఆ రోజు వరకు ఉంటానో పోతానో తెలియదు అన్నట్లుగా ఈయన పెట్టిన పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. మరి ఇంతకీ సిద్దు జొన్నలగడ్డ ఎందుకు అలాంటి పోస్ట్ పెట్టారు.. ఆయన పోస్ట్ వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Siddhu Jonnalagadda shocking post

సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసు కదా మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యనే కంప్లీట్ అయింది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో అప్పటివరకు మేము ఉంటామో పోతామో తెలియట్లేదు అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ పెట్టడంతోనే చాలామంది నెటిజెన్లు సిద్దు జొన్నలగడ్డకు ఏదైనా వ్యాధి ఉందా.. ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టారు..ఉంటానో పోతానో అని పోస్ట్ పెట్టడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అని చాలామంది ఆలోచనలో పడ్డారు. (Siddhu Jonnalagadda)

Also Read: Prabhas: ప్రభాస్ కి అవమానం.. కల్కి లో ఆయన ఒక జోకర్.. సంచలన ట్వీట్ వైరల్.!

అయితే పోస్ట్ మొత్తం చూస్తే గాని ఆయన పెట్టిన పోస్టులో ఉన్న అర్థం ఏంటో బయటపడదు. అయితే మరో 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఓజి మూవీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి ప్రీమియర్ షోలకి తెలంగాణ,ఏపీలో పర్మిషన్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సిద్దు జొన్నలగడ్డ ఈ విధంగా పోస్ట్ చేశారు.మరో నాలుగు రోజుల్లో ఓజీ మూవీ విడుదల కాబోతోంది. ఓజీకి వస్తున్న హైప్ ఎఫెక్ట్ మా ఆరోగ్యం పై పడేలా కనిపిస్తోంది. 25వ డేట్ వరకు మేము ఉంటామో పోతామో తెలియట్లేదు.

Siddhu Jonnalagadda shocking post

ఇప్పుడే ఇలా ఉంటే 25 తేదీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో..మీరు పవన్ కాదు.. గాలి తుఫాన్ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.అలా ఓజి మూవీపై తనదైన శైలిలో సిద్దు జొన్నలగడ్డ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.ఇక పవన్ కళ్యాణ్ ఓజి మూవీకి సుజీత్ దర్శకత్వం వహించగా..డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు.(Siddhu Jonnalagadda)

Share your love