T20 World Cup 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందరూ ఇండియన్ ప్రీమియర్ 2024 టోర్నమెంట్ మత్తులో ఉన్నారు. ఈసారి తమ ఫేవరెట్ జట్టు గెలవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అన్ని జట్లు చాలా బాగా ఆడుతున్నాయి. భయంకరమైన స్కోర్స్ కూడా నమోదు అయితున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ పాలకమండలి కీలక ప్రకటన చేసింది. T20 World Cup 2024
India T20 World Cup Squad 2024 Rohit is unfair to those young stars
టి20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పూర్తికాగానే జూన్ మొదటి వారం నుంచే టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటినుంచి జట్టును సెట్ చేయాలని ఉద్దేశంతో… టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొత్తం 15 సభ్యులతో కూడిన జట్టు వివరాలను సోషల్ మీడియాలో ప్రకటించింది. T20 World Cup 2024
Also Read: IPL 2024: ఐపీఎల్ లో ఫ్రాంచైజీకి వేల కోట్లు ఎలా వస్తాయి? ఎవరి వాటా ఎంత?
అయితే ఇందులో రోహిత్ శర్మకు ఛాన్స్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ జరుగుతుంది. హార్దిక్ పాండ్యా స్థానంలో… ఋతురాజు లేదా రింకు సింగ్ లాంటి డేంజర్ బ్యాటర్లను తీసుకోవాల్సి ఉందని… కానీ హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేయడం చాలా దారుణమని ఫ్యాన్స్ తో పాటు కొంతమంది క్రీడా విశ్లేషకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆక్సిడెంట్ నుంచి బయటపడ్డ రిషబ్ పంత్కు మంచి అవకాశం కల్పించిందని చెబుతున్నారు. T20 World Cup 2024
అలాగే రాజస్థాన్ కెప్టెన్ గా అదరగొడుతున్న సంజు శాంసన్ కు చోటు ఇవ్వడం మంచిదేగాని చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరు వికెట్ కీపర్ లో ఉన్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ పక్కకు పెట్టింది బీసీసీఐ పాలకమండలి. దీంతో ఫాన్స్ బిసిసి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ప్రదర్శన కనబడుతున్న హార్దిక్ పాండ్యా స్థానంలో రింకు, రుతురాజ్ లేదా కేఎల్ రాహుల్ ను తీసుకుంటే బాగుండేదని చెబుతున్నారు. T20 World Cup 2024