

KCR: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యే కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్యేలపై సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నిర్ణయంతో గులాబీ పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరణ తెలుపుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. KCR
KCR MLA who defected from party escapes
అంతేకాదు అయిదుగురు ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్ లను కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలోనే ఉన్నారని తేల్చి చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ లిస్టులో భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు తెల్లం, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అలాగే అరికపూడి గాంధీలకు ఊరుట ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ పిటిషన్లను కొట్టివేశారు. KCR
Also Read: Chandrababu Naidu: అలిపిరి ఘటన..తిరుమల శ్రీవారిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..?
దీంతో వేటు నుంచి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎస్కేప్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో న్యాయం కోసం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కునుంది. సుప్రీం కోర్టులో పిటీషన్లు ఇప్పటికే బీఆర్ ఎస్ పార్టీ వేసింది. అక్కడ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ పిటిషన్లను కొట్టివేయడంపై సుప్రీం కోర్టు సమర్థిస్తే మాత్రం గులాబీ పార్టీకి షాక్ తప్పదు. KCR
Also Read: Raghu Rama Krishna Raju: రఘురామ కృష్ణరాజు సస్పెండ్? ట్వీట్ వైరల్







