

Gudem Mahipal Reddy: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఏ క్షణమైనా ఈ పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు కూడా రాబోతున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy Congress MLA joins BRS party
పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే మళ్లీ గులాబీ పార్టీలో చేరెందుకు సన్నద్ధమవుతున్నారట. ఈ మేరకు ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్చెరులో బీఆర్ఎస్ ఫ్లెక్సీ, చర్చనీయాంశంగా మారింది. Gudem Mahipal Reddy
Also Read: Chandrababu: మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు..చంద్రబాబు సంచలనం ?
బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఫోటో కలకలం రేపింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా…మాజీ మంత్రి హరీష్రావును కలిసారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు. దీంతో మహిపాల్రెడ్డి త్వరలో బీఆర్ఎస్లో చేరతారని ప్రచారం జోరు అందుకుంది. ఈ మేరకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. Gudem Mahipal Reddy
Also Read: Kavitha: కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్.. ఎన్నంటే?







