

Rayachoti: రాయచోటి జిల్లా వివాదం ఏపీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు స్పీడ్కు వైసీపీ బ్రేక్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ పార్టీ. ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా, నోటిఫికేషన్ లేకుండా జిల్లా కేంద్రాన్ని మార్చారని కోర్టుకు విన్నవించారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. Rayachoti
Rayachoti Petition in High Court regarding change of Rayachoti district headquarters
చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయంపై ప్రజల తరపున చివరి వరకూ పోరాడతానంటూ రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హేతుబద్ధత లేకుండా విభజన చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అంటూ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని కోర్టును ఆశ్రయించామన్నారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. Rayachoti
Also Read: Jagan: కర్మకాలి జగన్ అధికారంలోకి వస్తే, కూరలో పసుపు వేయడానికి కూడా వణికిపోతారు ?
రాయచోటి మార్పుపై ప్రజల మనోవేదనను గుర్తించి ప్రభుత్వం నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ప్రభుత్వం చేసిన అన్యాయంపై న్యాయం జరుగుతుందని హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. విభజన, జిల్లా కేంద్రం మార్పుపై ప్రభుత్వం ఎటువంటి విధివిధానాలు పాటించలేదని ఫైర్ అయ్యారు. న్యాయస్థానాల్లో తప్పకుండా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని స్పష్టం చేశారు శ్రీకాంత్ రెడ్డి. Rayachoti
Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడకు చిక్కులు ?







