

BRS: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రహస్యంగా కలిశారట మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. BRS
BRS Yennam Srinivas Reddy is getting closer to KCR
దీంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, గులాబీ పార్టీలోకి యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెళ్తాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలకు ఎవరికీ తెలియకుండా యెన్నం శ్రీనివాసరెడ్డి వెళ్లడం ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గంలో కొత్త టెన్షన్ తీసుకువచ్చింది. అయితే సాధారణంగానే అసెంబ్లీ సమావేశాలలో భాగంగానే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కలిసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS
Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడకు చిక్కులు ?
ఇందులో ఎలాంటిది ఏం లేదని అంటున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయాన్ని ఓ రేంజ్ లో ఆడుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలోకి రానున్నాడని గులాబీ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. BRS
Also Read: Jagan: కర్మకాలి జగన్ అధికారంలోకి వస్తే, కూరలో పసుపు వేయడానికి కూడా వణికిపోతారు ?







