

BRS: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. 13వ తారీకున రిజల్ట్ వస్తుంది. ఇక ఇవాళ విత్డ్రా కార్యక్రమం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. BRS
BRS Three more former MLAs join KCR party
ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో గులాబీ పార్టీ దూసుకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆరూరి రమేష్ గులాబీ పార్టీలో చేరగా, గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు కూడా సొంతగూటికి రాబోతున్నారట. ఈ మేరకు మొన్న సీట్ విచారణ చేసిన సందర్భంగా కేసీఆర్ తో ఫోటో దిగి మహిపాల్ రెడ్డి సోదరుడు హల్చల్ చేశాడు. BRS
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్లో టీడీపీ కార్యకర్తల నిరసన
అయితే తాజాగా మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుని ఎందుకు సిద్ధమయ్యారట. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు మళ్లీ కెసిఆర్ పార్టీలోకి రాబోతున్నారట. ఇవాళ లేదా రేపు ఎప్పుడు వచ్చేది తెలియదు కానీ.. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారట. ఇందులో ఏనుగు రవీందర్ రెడ్డి, జలగం వెంకట్రావు అలాగే శానంపూడి సైదిరెడ్డి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. BRS







