
Dharmapuri Arvind: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దాదాపు సగం పూర్తయింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో 50 శాతానికికి పైగా పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Dharmapuri Arvind
Dharmapuri Arvind on janasena party
తెలంగాణలో మాకు ఎవడి మద్దతు అవసరం లేదని బాoబు పేల్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని కూడా వెల్లడించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని క్లారిటీ ఇచ్చారు. Dharmapuri Arvind
Also Read: Chandrababu: తెలంగాణలో చంద్రబాబును విమర్శిస్తే కేసా..?
పవన్ కళ్యాణ్ పార్టీతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పొత్తు ఉందని వివరించారు. తెలంగాణలో మాత్రం పవన్ కళ్యాణ్ తో ఎలాంటి పొత్తులేదని తెలిపారు. ఒంటరిగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్తామని బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ వెల్లడించారు. దీంతో ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Dharmapuri Arvind
Also Read: BRS: గులాబీ పార్టీలోకి జీవన్ రెడ్డి…కేసీఆర్ అపాయింట్మెంట్ ?





