వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనిషి తనమేంటో తెలియని నేత అని అంటున్నారు నెటిజన్లు. తన చెల్లెలు షర్మిల ఆపరేషన్ విషయంలో ఎలాంటి స్పందన చూపకపోవడం పెద్ద చర్చగా మారింది. ఈ సంఘటన వైసీపీ అధినేత గురించి చాలామంది అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తుంది. నిజానికి జగన్ దయ, ఆప్యాయత ఉన్న నాయకుడుగా ఎలివేట్ చేయబడ్డాడు. కానీ ఇప్పుడు అన్ని నకిలీ అన్నట్టు కనిపిస్తోంది.
YS Jagan Sister Sharmila Surgery Controversy
ఇటీవల ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నట్లుండి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆమెకు ఏకంగా ఆపరేషన్ కూడా చేశారు. అయినా, రక్తసంబంధమైన అన్నయ్య జగన్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. షర్మిల ఆదివారం సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి పోస్ట్ చేశారు. ఆసుపత్రి బెడ్ మీద ఫోటోతో ఆమె ఇప్పుడు రికవరీలో ఉన్నట్లు చెప్పారు. అనేక మంది ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
అయితే, వైఎస్ ఫ్యాన్స్ కు ఇది షాక్ ఇచ్చింది. తోడబుట్టిన చెల్లికి ఆపరేషన్ జరిగితే ఎవరైనా కనీసం ఓ పోస్టు పెడతారు. కానీ జగన్ నుంచి అలాంటి స్పందన లేదు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్న ఇలాంటి సందర్భాల్లో కనీసం సాయం చేయడం మంచిది. ఇందుకు వైఎస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ జగన్ మనిషి కాదని బోల్డ్ గా అన్నారు.
ఈ ఘటన వైఎస్ కుటుంబంలో split ను స్పష్టం చేస్తుంది. జగన్ ఎప్పుడూ కేవలం రాజకీయ వ్యూహాలపై దృష్టి పెడతారు. కుటుంబానికి సయితం సమయం ఇవ్వలేని పరిస్థితి ఇది. ఇప్పుడు జగన్ షర్మిల బాగోగులు పట్టించుకుంటారో లేదో చూడాలి. పబ్లిక్ ప్రెజర్ కి తలొగ్గి కనీసం పోస్టు పెట్టవచ్చు. కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ప్రజలు ఇప్పుడు జగన్ పై నమ్మకం కోల్పోతున్నారు.





