Jagan: జగన్ కు గండం మారిన అల్లుడు.. వైయస్ వారసుడిగా రంగంలోకి ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున చిక్కులు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి కంటే ఎక్కువగా ఇంట్లోనే గొడవలు తెరపైకి వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం వైయస్ షర్మిల అన్న సంగతి తెలిసిందే. పదేపదే వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిలమ్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలాగే వైసిపి పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారు. Jagan

Also Read: vegetarians: అత్యధిక శాకాహారులు ఉన్న టాప్ దేశాలివే.. పెరుగుతున్న వెజిటేరియన్స్!!

Jagan’s son-in-law, who became a tycoon, enters the fray as YS’s successor

అయితే తాజాగా తన కొడుకును తెరపైకి తీసుకువచ్చి కొత్త రాజకీయాలకు నాంది పలికారు వైయస్ షర్మిల. వైయస్ రాజశేఖర్ రెడ్డి అసలు సీసలు వారసుడు తన కొడుకు అంటూ… తాజాగా వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే వైసీపీ పార్టీ గత గత వణికి పోతుందని.. వైయస్ షర్మిల సంచల వ్యాఖ్యలు చేశారు. వైసిపి సైతాన్ సైన్యం అంతా అరిచి గీపెట్టినా కూడా వైయస్ వారసుడు తన కొడుకు అంటూ వ్యాఖ్యానించారు. Jagan

Also Read: Asia Cup 2025: ఆసియా కప్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్?

ఎన్ని కుక్కలు మొరిగినా సరే దీనిని ఏ ఒక్కరు కూడా మార్చలేరని తేల్చి చెప్పారు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి… తల పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు షర్మిల రూపంలో తనకు నెగిటివ్ రాగా.. ఇప్పుడు అల్లుడి రూపంలో… మరో గండం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని వైసిపి కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: KCR: జగన్ తో పొంగులేటి సమావేశం… కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కనా?