APY : ఉద్యోగులకి ప్రభుత్వ రంగంలో వాళ్లకి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ప్రైవేట్ రంగంలో వాళ్లకి పిఎఫ్ పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం బాగుండేందుకు ఇది హెల్ప్ అవుతుంది. అయితే అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకి ఎటువంటి సౌకర్యం ఉండదు. వీరికి కూడా 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన 2017 బడ్జెట్ టైంలో కేంద్ర ప్రభుత్వం మూడు సామాజిక భద్రత పథకాల్లో ఇది కూడా ఒకటిగా చేర్చింది.
APY scheme 5000 pension
60 ఏళ్ల తర్వాత వారు పెట్టుబడులకి అనుకూలంగా ప్రతినెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ వస్తుంది. ఈ స్కీం కింది ఇప్పటికే ఐదు కోట్ల మందికి పైగా నమోదు చేసుకున్నారు 18 నుండి 47 వరకు వయసున్న వారు ఈ స్కీమ్ లో చేరవచ్చు. పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి. ఎంపీఎస్ పరిధిలోకి వచ్చేవాళ్ళు ఈ స్కీమ్లో చేరడానికి అనర్హులు.
Also read: Galaxy S23: రూ.90 వేల ఫోన్ను.. రూ. 45వేలకే పొందొచ్చు..!
టాక్స్ పేర్లు కూడా ఇందులో చేరడానికి అవ్వదు చేరే వయసును బట్టి చెల్లించే దానిని బట్టి పెన్షన్ వెయ్యి నుండి 5000 వరకు వస్తుంది. 18 ఏళ్ల వయసులో చేరే వారు 60 ఏళ్ల వరకు అంటే 42 ఏళ్ళు స్కీం కింద కంట్రిబ్యూట్ చేయాలి. 18 ఏళ్ళకి ఈ స్కీమ్ లో చేరే వాళ్ళు 42 నుండి గరిష్టంగా 210 చెల్లించాలి. 210 చొప్పున 18 ఏళ్ల నుండి ఇన్వెస్ట్ చేసేవారికి 60 ఏళ్ల తర్వాత నెలకి 5000 పెన్షన్ వస్తుంది. 40 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల పాటు కాంట్రిబ్యూట్ చేయాలి రూ.291 నుండి 1454 వరకు చెల్లించాలి. గరిష్టంగా నెలకి రూ.1454 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రూ.5000 పెన్షన్ వస్తుంది (APY).