PM Kisan: కేంద్ర ప్రభుత్వం మనకి ఎన్నో రకాల స్కీములను అందిస్తోంది. రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమృద్ధి యోజన స్కీమ్ ని అందిస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది రైతులకి ఈ స్కీం వలన ప్రయోజనం ఉంటోంది. పీఎం కిసాన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు బదిలీ చేయడం వలన ఈ పథకం దిక్సూచిలా మారింది ప్రధాన మంత్రి కిసాన్ సమాధి పథకానికి సంబంధించి 17వ విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నప్పటికీ రైతులు చేసే ఒక తప్పు కారణంగా ఈ పథకానికి అర్హతని కోల్పోతున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్లి పోదాం.
PM Kisan benefits will gone if do this
ప్రస్తుతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి 17వ విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నప్పటికీ రైతులు చూసే ఒక తప్పు పథకానికి సంబంధించిన అర్హతను కోల్పోయేలా చేస్తోంది. కొంతమంది లబ్ధిదారులు లోన్ల కోసం ఇన్కమ్ టాక్స్ కడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ పథకానికి అర్హతను కోల్పోతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ అర్హత గురించి తెలుసుకోవడం మంచిది. లేదంటే అనవసరంగా స్కీము బెనిఫిట్స్ ని మీరు పొందలేరు.
Also read: Harish Rao: కాంగ్రెస్ మాటలు ఆకాశంలో.. చేతలు పాతాళంలో..!
15వ విడతను నవంబర్ 15, 2023న మోడీ విడుదల చేశారు. పీఎం-కిసాన్ పథకం కింద, అర్హులైన రైతులు నాలుగు నెలలకు రూ. 2,000 పొందుతారు. ఇది సంవత్సరానికి రూ. 6,000. ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ అలానే డిసెంబర్-మార్చి వంటి మూడు వాయిదాలలో డబ్బు ని పొందుతారు. 2019 మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఈ స్కీము ని ప్రకటించారు (PM Kisan).