Farmers : కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీములను తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీముల వలన చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటోంది. కొత్త కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన పనుల జాబితా పరిశీలించినట్లయితే రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి సీజన్లో కూడా రైతులకు సహాయాన్ని అందించడానికి పనిచేసేటువంటి మూడు పథకాల గురించి ఇప్పుడు చూద్దాం.
Schemes for farmers from government
లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చూస్తే పీఎం కిసాన్ సమాధి యోజన కూడా ఇందులో ఉంది. రైతులకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న మూడు పథకాల గురించి ఇప్పుడు చూద్దాం.. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని 1998లో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకువచ్చింది. వ్యవసాయం లేదా వ్యవసాయ ఖర్చులకి తగ్గిన రుణం అందించడానికి ప్రారంభించింది. ఇవి వ్యవసాయ లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ప్రభుత్వ సబ్సిడీ రూపంలో ఏడాదికి నాలుగు శాతం రాయితీ రేటుతో వ్యవసాయ లోన్స్ కలిగిన రైతులకు భారత ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుంది.
Also read: Electric Bike: ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. 323 కిలోమీటర్లు ట్రావెల్ చెయ్యచ్చు..!
ఇప్పటివరకు 2.5 కోట్ల మంది రైతులు ఈ స్కీంలో లబ్ధి పొందారు. ప్రధానమంత్రి కిసాన్
సమ్మాన్ నిధి యోజన ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఎటా పంట సహాయం కింద రూ.6000 వస్తుంది. దేశంలో ఏ రైతు అయినా సరే ఈ స్కీము లో చేరవచ్చు. మూడు విడతల కింద ప్రతి నాలుగు నెలలకి ఒకసారి 2000 చప్పున ఇస్తారు టాక్స్ చెల్లింపు దారులు వారి కుటుంబ సభ్యులు ఈ పథకంలో చేరడానికి కుదరదు (Farmers).