Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యాకనే ఈమె తెలుగు ఇండస్ట్రీలో ఇంత గుర్తింపు తెచ్చుకుంటే ఒకవేళ ఈ సినిమా విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ అయితే ఈ హీరోయిన్ కి సౌత్ లో తిరుగుండదు అనేది సినీ విశ్లేషకుల భావన. అయితే అలాంటి జాన్వీ కపూర్ శిఖర్ పహారియాలు ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే శిఖర్ పహారియాతో కలిసి పబ్బులు,పార్టీలు అంటూ తిరగడమే కాదు..
Janhvi Kapoor secretly married her boyfriend
గుళ్ళు గోపురాలు అంటూ కూడా తిరుగుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక వీరిద్దరూ కలిసి చాలాసార్లు తిరుపతికి సాంప్రదాయమైన వస్త్రాధరణలో వెళ్లారు. అయితే అలాంటి ఈ జంట పెళ్లి త్వరలోనే ఉండబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది అంతేకాకుండా బోనీ కపూర్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు సమాచారం.ఇదంతా పక్కన పెడితే శిఖర్ పహారియా ని జాన్వీ కపూర్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అంటూ కొంతమంది ఈ విషయాన్ని వైరల్ చేశారు. (Janhvi Kapoor)
Also Read: Nithiin: నువ్వసలు హీరోవేనా అంటూ నితిన్ ని ఘోరంగా అవమానించింది ఎవరు..?
దాంతో ఈ మ్యాటర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి స్వయంగా ఈ మ్యాటర్ లోకి జాన్వీ కపూరే ఎంట్రీ ఇచ్చి క్లారిటీ ఇచ్చింది. అయితే తనకి ఎంతో ఇష్టమైన తిరుమల తిరుపతి దేవాలయంలో శిఖర్ పహారియా ని రహస్యంగా జాన్వీ కపూర్ పెళ్లి చేసుకున్నట్టు ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ నేను ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా నాకు ఎంతో ఇష్టమైన తిరుమలలో నచ్చిన వాడిని పెళ్లాడుతాను అంటూ చెప్పింది.
అయితే ఈ విషయాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది ఆకతాయిలు రహస్యంగా ప్రియుడిని జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంది అంటూ ఒక రూమర్ క్రియేట్ చేశారు.అయితే ఈ రూమర్ పై తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కుచ్ బి అంటూ ఒక కామెంట్ పెట్టి పెళ్లి వార్తలను ఖండించింది. అంటే తన పెళ్లి వార్తలు వైరల్ అవుతుండగా దీనిపై ఏదైనా రాసేస్తారా అంటూ స్పందించింది జాన్వీ..దీంతో జాన్వీ కపూర్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ వచ్చింది.(Janhvi Kapoor)