Sridevi: అతిలోకసుందరి శ్రీదేవి కి ఎవరితో వైరం ఉండదు. అసలు ఆమె మొహం చూస్తే ఎవరికీ గొడవ పెట్టుకోవాలి అనే భావన కూడా వారి మైండ్ లోకి రాదు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మతో సొంత చెల్లలే గొడవ పెట్టుకుందట.అంతేకాదు శ్రీదేవి మీద ఉన్న పగతో కనీసం ఆమె చనిపోయినా కూడా చివరి చూపు చూడ్డానికి రాలేదని అప్పట్లో చాలామంది శ్రీదేవి చెల్లి కసాయితనం గురించి కథలు కథలుగా మాట్లాడుకున్నారు.మరి ఈ ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి..ఎందుకు చనిపోయినా కూడా చివరి చూపు చూడడానికి శ్రీదేవి చెల్లి రాలేదు అనే సంగతి ఇప్పుడు చూద్దాం.
Sridevi younger sister who does not see her face even after death
శ్రీదేవి ఆమె చెల్లి శ్రీలత మధ్య గొడవ వచ్చింది శ్రీదేవి తల్లి మరణించిన సమయంలోనట.అయితే శ్రీదేవి తల్లి అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయింది.కానీ ఆమె డాక్టర్లు నిర్లక్ష్యం వల్లే చనిపోయింది అని శ్రీదేవి ఆ సమయంలో కోర్టులో కేసు వేసి ఆ కేసు గెలిచి వైద్యుల దగ్గర నుండి 7.2 కోట్లను నష్ట పరిహారంగా తీసుకుంది.. అయితే శ్రీదేవి చెల్లి శ్రీలత అప్పటికే పెళ్ళై ఒక ఇంటికి కోడలుగా వెళ్ళింది. (Sridevi )
Also Read: Sridevi: శ్రీదేవిని ప్రేమలో పడేసి శ్రీదేవి చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..?
అలాగే శ్రీదేవికి అప్పటికి పెళ్లి కాలేదు.తల్లి బాగోగులు కుటుంబానికి సంబంధించిన ఏ విషయాలైనా శ్రీదేవినే చూసుకునేది. అలా తన తల్లి విషయంలో ఏడు కోట్ల రూపాయలు వచ్చిన సమయంలో శ్రీదేవి చెల్లెలు శ్రీలత తల్లి మరణం తర్వాత వచ్చిన నష్టపరిహారంలో తనకు కూడా రెండు కోట్ల వాటా రావాలి అని గోలగోల చేసి చివరికి ఆమె కూడా సొంత అక్క శ్రీదేవి పైనే కేసు పెట్టి చివరికి కేసు కూడా గెలిచి రెండు కోట్ల రూపాయలు అయితే అందుకోగలిగింది.
కానీ డబ్బు ఎంత దగ్గర వారినైనా దూరం చేస్తుంది అన్నట్లు ఈ అక్క చెల్లెళ్ల మధ్య చాలా దూరం పెంచింది. అప్పటినుండి ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య మాటలు ఉండేవి కావట.అంతేకాదు శ్రీదేవి చనిపోయిన సమయంలో కూడా ఆమె చివరి చూపు చూడడానికి శ్రీలత కనీసం రాలేదు అని ఎంతోమంది ఈమె అభిమానులు, సన్నిహితులు, బంధువులు గుసగుసలు పెట్టుకున్నారు.(Sridevi )