తెలంగాణ ప్రగతి కోసం కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రికి key proposals అందజేశారు. ఈ KTR meetingలో అశ్వినీ వైష్ణవ్తో మాట్లాడుతూ వరంగల్లో AI సెంటర్, డేటా ల్యాబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ సిటీ అయిన వరంగల్లో ఇప్పటికే మంచి infrastructure ఉందని, అక్కడ IT రంగాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
KTR Meeting Key Proposals Submitted
ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో STPI సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. ఈ సెంటర్లో AI, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ డిజైన్, డీప్ టెక్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించారు. మరో టైర్-2 నగరంలో STPI కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్లను తెలంగాణ జిల్లాల్లో అమలు చేయాలని సూచించారు.
రైల్వే డివిజన్ల డిమాండ్ కూడా ఈ మీటింగ్లో లేవనెత్తారు. కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, అలాగే కొత్తగూడెంలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక IT టవర్లు దివాలా తీశాయని, హైదరాబాద్లో IT ఉద్యోగాలు 9.46 లక్షల నుంచి 9.39 లక్షలకు తగ్గాయని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణలో ప్రతి జిల్లాలో పిల్లలకు స్థానికంగా IT ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ KTR meeting ద్వారా రాష్ట్రంలో IT రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము కృషి చేస్తున్నామని, యూత్ కు మెరుగైన అవకాశాలు కల్పించాలని తెలిపారు.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





