

Peddireddy: సింగపూర్ లో చంద్రబాబు కోట్లల్లో లావాదేవీలు జరిపినట్లు షాకింగ్ నిజాలు బయటపెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలోనే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. Peddireddy
Peddireddy slams chandrababu naidu
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తవుతుందని పేర్కొన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ రెండేళ్లలో ఒక అభివృద్ధి పథకం గాని సంక్షేమ పథకం కానీ పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహించారు. అప్పుల కోసం వెంపర్లాడమే ప్రభుత్వం దేయంగా పెట్టుకుందని మండిపడ్డారు. దోచుకున్న డబ్బులు విదేశాల్లో దాచుకుంటున్నారని ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. Peddireddy
Also Read: Poonam Kaur: డైరెక్టర్ త్రివిక్రమ్పై పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్
నేడు లండన్ పర్యటన అని చెప్పి సింగపూర్ లో వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నారని వదంతులు వస్తున్నాయని ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని వివరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హామీల అమల్లో చంద్రబాబు, వైయస్ జగన్ కు తేడా ప్రజలు గమనించాలని కోరారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. Peddireddy
Also Read: Rayachoti Demands : రాయచోటి మంటలు…ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాజీనామా ?







