Tolivelugu Raghu: వివాదంలో తొలి వెలుగు రఘు…ఎన్ఐఏ నోటీసులు

Tolivelugu Raghu NIA notices Studio
Tolivelugu Raghu NIA notices Studio
Tolivelugu Raghu NIA notices Studio

Tolivelugu Raghu: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జర్నలిస్టుగా పేరు గాంచిన తొలి వెలుగు రఘుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి టైంలో ఏకంగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది. తాజాగా తొలివెలుగు రఘు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. దీంతో తొలివేలుగు రఘు స్టూడియోకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం జరిగింది. Tolivelugu Raghu

Tolivelugu Raghu NIA notices Studio

మాజీ మావోయిస్టు కట్టా రామచంద్ర రెడ్డి మృతి చెందిన ప్రాంతానికి వెళ్లి తొలి వెలుగు రఘు వీడియో షూట్ చేసి మరీ అప్లోడ్ చేశాడు. అంతేకాదు మాజీ మావోయిస్టు గాద ఇన్నారెడ్డి అరెస్టుకు సంబంధించిన కారణాలు అంటూ మరో వీడియో అప్లోడ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. మావోయిస్టులను ఏరిపారేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంటిమీద కునుకు లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అనుమానం కలిగిన అందరిని NIA అరెస్టు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తొలివెలుగు రఘు చేసిన పని కేంద్రానికి కోపం తెప్పించింది. Tolivelugu Raghu

Also Read: CM Revanth Reddy: రాష్ట్రప‌తికి ఘోర అవ‌మానం..మ‌రో వివాదంలో సీఎం రేవంత్ ?

ఈ నేపథ్యంలోనే తాజాగా తొలివెలుగు రఘు స్టూడియో కు ఎమ్మెల్యే నోటీసులు అందించింది. ఈరోజు గచ్చిబౌలి NIA కార్యాలయంలో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే దీనిపై ఇప్పటివరకు తొలి వెలుగు రఘు స్పందించలేదు. ఒకవేళ మొండిగా తొలివెలుగు రఘు వ్యవహరిస్తే మాత్రం ఆయనను కూడా అరెస్టు చేయడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు రోజుల కిందట గాద ఇన్నారెడ్డిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. Tolivelugu Raghu

Also Read: Ys Jagan: జగన్ అభిమానులపై లాఠీఛార్జ్ చేయించిన సీఎం రేవంత్ రెడ్డి ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu