

Thummala: తెలంగాణ కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు దర్శనమిచ్చాయి. ఇవాళ ఖమ్మం జిల్లాలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. Thummala
TDP flags at the Thummala program
అయితే తన సొంత జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు వెళ్లడంతో, కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే తుమ్మల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు కూడా ఈ కార్యక్రమంలో దర్శనమిచ్చాయి. Thummala
Also Read: Sampath Kumar: 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం..వివాదంలో కాంగ్రెస్ నేత ?
దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక దీనిపై వైసీపీతో పాటు గులాబీ పార్టీ సోషల్ మీడియాలు ఓ రేంజ్ లో స్పందిస్తున్నాయి. తుమ్మల కార్యక్రమానికి టిడిపి జెండాలు ఎందుకు వచ్చాయని పరువు తీస్తున్నాయి. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీకి అలాంటి సంబంధం ఉందని కూడా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. Thummala
Also Read: Congress: 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా చేయండి ?







