
Patnam Suneetha Mahender Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పట్నం సునీత రెడ్డి. కెసిఆర్ పాలనలో గులాబీ పార్టీలో అనేక పదవులు అనుభవించిన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత రెడ్డి… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జంప్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు దంపతులు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. Patnam Suneetha Mahender Reddy
Patnam Suneetha Mahender Reddy on cm revanth reddy
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పట్నం సునీత రెడ్డి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తనకు పడుతున్న చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వకుండా.. ఓడిపోయే మల్కాజ్గిరి టికెట్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు పట్నం సునీత రెడ్డి. అందుకే తాను ఓడిపోయినట్లు వెల్లడించారు. Patnam Suneetha Mahender Reddy
Also Read: SHIVAJI : పాలిటిక్స్ పై నటుడు శివాజీ సెన్షేషన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్
2006 సంవత్సరంలో జడ్పీ చైర్మన్ గా తాను ఉన్నప్పుడు.. రేవంత్ రెడ్డి నాకంటే తక్కువ పదవులు ఉండేవాడని బాంబు పేల్చారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యుడు అయి, ఇప్పుడు లేటెస్ట్ గా ముఖ్యమంత్రి కూడా అయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం జెడ్పి చైర్మన్ స్థాయిలోనే ఆగిపోయానని ఎమోషనల్ అయ్యారు పట్నం సునీత రెడ్డి. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Patnam Suneetha Mahender Reddy
Also Read: MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచలన…




















