ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న మెగా బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ విడుదలకు ముందే నెట్ఫ్లిక్స్తో రూ.180 కోట్ల ఓటీటీ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ వార్తలు ట్రేడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. సౌత్ ఇండియన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ ఈ భారీ మొత్తం చెల్లించిందని సమాచారం.
ఫౌజీ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను ఏఏ ఫిలిమ్స్ రూ.60 కోట్లకు దక్కించుకుందని టాక్. శాటిలైట్, ఆడియో రైట్స్ వంటి ఇతర ఒప్పందాలు ఇంకా ఫైనల్ కాలేదు. అవి కూడా పూర్తయితే నాన్-థియేట్రికల్ బిజినెస్ మరింత భారీగా ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ డీల్స్పై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటనేమీ లేదు.
సీతారామం ఫేమ్ హను రాఘవపూడి 1930ల నాటి స్వాతంత్ర్య ఉద్యమం, యుద్ధ వాతావరణం, దేశభక్తి నేపథ్యంగా ఫౌజీ తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఓ బెటాలియన్ లీడర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో యాక్షన్తో పాటు స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ కీలకంగా ఉండనున్నాయి. కొత్త హీరోయిన్ ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 3న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఇప్పటివరకు భారతీయ ప్రేక్షకులు చూడని కాన్సెప్ట్తో హను చాలా వినూత్నంగా కథ రూపొందిస్తున్నారని చెప్పారు. ఫౌజీ విడుదల సమీపిస్తున్న కొద్దీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి.





