
Chandrababu Naidu: అలిపిరి సంఘటనపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారిని ఉద్దేశిస్తూ ఈ సందర్భంగా బాంబు పేల్చారు. తాను చనిపోతే తిరుమల వెంకటేశ్వర స్వామికి అపవాదు వస్తుందని సాక్షాత్తు ఆయనే తనను కాపాడాడని వెల్లడించారు. ఇదొక మిరాకిల్ అంటూ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసిపి కౌంటర్ ఇస్తోంది. Chandrababu Naidu
Chandrababu Naidu moving comments on Tirumala Srivari
అలిపిరి సంఘటనను ఉద్దేశించి, తిరుమల శ్రీవారిపై వ్యాఖ్యలు చేయడం దారుణం అంటున్నారు వైసీపీ నేతలు. కాగా 2003, అక్టోబర్ 1వ తేదీన తిరుమల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నక్సలైట్లు చంద్రబాబు నాయుడు కారుపై దాడులు చేసినట్లు నివేదికలో తేలింది. ఈ తరుణంలోనే తాజాగా అలిపిరి సంఘటనపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. Chandrababu Naidu
Also Read: BRS VS Congress: ఆసుపత్రికి వచ్చిన మహిళలపై అత్యాచారం..ఆ రాజకీయ నేత భాగోతం ఇదే…
అక్కడితో ఆగకుండా మెడికల్ కాలేజీల ప్రయివేటికరణపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. వాటి పేరు ప్రభుత్వ కళాశాల.. పక్కన ప్రైవేట్ వాళ్ల పేరు చిన్న అక్షరాలతో వారి పేరూపెట్టుకొని వాళ్లు మ్యానేజ్ చేస్తారని తెలిపారు. వీళ్లే సీఎం రిలీఫ్ కర్ణాటక, హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు వై? అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా.. అంటూ ప్రశ్నించారు. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందిస్తే మీకు నష్టం ఏంటి ? అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. దీంతో ఈ వ్యాఖ్యలు కూడా దూమారం రేపుతున్నాయి. Chandrababu Naidu
Also Read: TDP: టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి, కమీషన్ అడిగిన సొంత పార్టీ ఎమ్మెల్యే ?





