
KCR: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగాయి. దాదాపు రెండు నెలల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు అలాగే ముఖ్యమంత్రి అందరూ బరిలోకి దిగగా, గులాబీ పార్టీ నుంచి అన్నీ తానై కేటీఆర్ ముందుండి నడిపించాడు. KCR
KCR will not come to Jubilee Hills KTR
హరీష్ రావు తన తండ్రి మరణం కారణంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారానికి దూరమయ్యాడు. అటు తప్పక రావాల్సిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జూబ్లీహిల్స్ ముఖం కూడా చూడలేదు. దీంతో భారం మొత్తం కేటీఆర్ పైన పడింది. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ అన్ని శక్తులు వినియోగించుకొని గడ్డకు ఎక్కింది. నైతిక విజయం గులాబీ పార్టీ ది అయినప్పటికీ ఇప్పుడు కేటీఆర్ ను బలి పశువు చేసింది కేసీఆర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. KCR
Also Read: IND VS SA: గంభీర్ చెత్త నిర్ణయాలు..3వ స్థానంలో సుందర్..సాయి సుదర్శన్ కెరీర్ ఖతం…
కేటీఆర్ తో పాటు కేసీఆర్ రెండు సభలు పెట్టి ఉంటే పరిస్థితి వేరే లాగా ఉండేదని గులాబీ పార్టీ కార్యకర్తలే ఇప్పుడు చర్చించుకుంటున్నారు. కెసిఆర్ బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన సరిపోలేదని ఇప్పుడు మొత్తుకుంటున్నారు. గతంలో దుబ్బాక విషయంలో కూడా అలాగే చేశారు కేసీఆర్. దీంతో కేటీఆర్ ను కెసిఆర్ బలి పశువు చేశాడని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. KCR
Also Read: Telangana: ముకుల్ రాయ్ ఎఫెక్ట్..తెలంగాణలో 10 ఉప ఎన్నికలు పక్కా ?





