
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం…. అసెంబ్లీకి రాని వారి జీతాలు కట్ చేస్తామని పదేపదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనడంతో… ఈ నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి.
Also Read: Guava: వర్షాకాలంలో జామ చెట్టుకు మొక్కాల్సిందే…ఇది తింటే కాన్సర్ తో పాటు 100 రోగాలకు…
Jagan’s sensational decision 11 YCP MLAs resign
11 మందితో రాజీనామా చేయించి.. మళ్లీ గెలిచి చూపించాలని ఈ ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు… దసరా తర్వాత నిర్ణయం తీసుకొని రాజీనామా చేయబోతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. ఈ విషయాలను ఇటీవలే ఎమ్మెల్యేలు అందరికీ.. చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బయోపిక్.. హీరో ఎవరంటే?
11 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే… అందరిని గెలిపించుకునే బాధ్యత తనదేనని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని… రాజీనామా చేసినప్పటికీ తామే గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు 11 మందితో రాజీనామా చేయించేందుకు సిద్ధమవుతున్నారట. అటు 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే.. అన్ని గెలవాలని కూటమి ప్లాన్ చేస్తోంది.
Also Read: Break Fast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా…అయితే ప్రమాదం తెచ్చుకున్నట్లే?




















