CM REVANTH REDDY : హైదరాబాద్‌ మెట్రోను L & T నుంచి పూర్తిగా స్వాధీనం రేవంత్ నిర్ణయం ?

CM REVANTH REDDY : తెలంగాణ కేబినెట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎల్అండ్ టీ కంపెనీ నిర్వ‌హిస్తున్న హైద‌రాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్ మెట్రో స్వాధీనం పై తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. హైద‌రాబాద్ మెట్రోను ఎలా స్వాధీనం చేసుకోవాల‌నే ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించేందుకు కేబినెట్ స‌బ్ క‌మిటీనీ ఏర్పాటు చేసింది. CM REVANTH REDDY

CM Revanth Reddy’s decision to completely over Hyderabad Metro from L&T

తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క నేతృత్వంలోని క‌మిటీలో మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, జూప‌ల్లి కృష్ణారావు స‌భ్యులుగా ఉండ‌నున్నారు. మెట్రో స్వాధీనం చేసుకునేందుకు గ‌త ఏడాదిలోనే ఎల్అండ్ టీ కంపెనీతో తెలంగాణ ప్ర‌భుత్వానికి ఒప్పందం కుదిరిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఒప్పందంలో హైద‌రాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు మొత్తం రూ.15వేల కోట్లు అని అంచెనా వేసింది. CM REVANTH REDDY

Also Read : AP: ఆరోగ్య బీమాలో రూ.4 వేల కోట్ల స్కామ్ ?

మెట్రో కు ఉన్న రూ.13వేల కోట్ల రుణాల‌ను ఎల్అండ్ టీ కంపెనీ నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం మెట్రో కు ఉన్న రూ.13వేల కోట్ల రుణాల‌ను బ‌ద‌లాయించుకోనుంది. రూ.2వేల కోట్ల ఈక్విటీని ఒకేసారి సంస్థ‌కు చెల్లించేలా ప్ర‌భుత్వం, ఎల్అండ్ టీ కంపెనీ అవ‌గాహ‌న‌కు వ‌చ్చాయి. ఐడీబీఐ క్యాపిట‌ల్.. రైళ్లు, ట్రాక్ లు, సిగ్న‌లింగ్సిస్ట‌మ్స్ వంటి టెక్నిక‌ల్ అంశాల‌పై డీఎంఆర్సీ లెక్క‌లు వేసి ప్రాథ‌మిక నివేదిక‌లు ఇచ్చాయి.

Also Read : BRS: ఏపీలోకి వస్తే తన్ని తరిమేస్తాం.. గులాబీ పార్టీకి మంత్రి వార్నింగ్ !



Share your love