
Rajinikanth: ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఇంటర్ తీవ్ర విషాదం నెలకొంది. రజనీకాంత్ తండ్రి మృతి చెందారు. వామపక్ష కార్మిక ఉద్యమ నేత వెల్లలచెరువు సాంబశివరావు ఇవాళ ఉదయం మరణించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే సాంబశివరావుకు నిన్నటి నుంచి వైద్యం అందించిన కూడా పరిస్థితి చేయి దాటిపోయిందట. Rajinikanth
TV9 Managing Editor Rajinikanth father Sambasiva Rao passes away
ఈ నేపథ్యంలోనే బుధవారం వేకువజామున రజనీకాంత్ తండ్రి సాంబశివరావు మరణించినట్లు తెలుస్తోంది. ఆయన వయసు ప్రస్తుతం 81 సంవత్సరాలు. బిఎస్ఎన్ఎల్, పోస్టల్ అండ్ టెలికాం రంగాల్లో అనేక ఉద్యమాలు చేశారు సాంబశివరావు. ఇక ఆయన మృతి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. Rajinikanth
Also Read: TDP: టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి, కమీషన్ అడిగిన సొంత పార్టీ ఎమ్మెల్యే ?
ఇది ఇలా ఉండగా, రజినీకాంత్ తండ్రి మరణం నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి రజిని ఎమోషనల్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్, TV9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ గారి తండ్రి సాంబశివరావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానన్నారు. \శ్రీ సాంబశివరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి భౌతికకాయానికి నివాళి అర్పించాను. ఈ కష్టసమయంలో రజినీకాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు రజినీ. Rajinikanth
Also Read: BRS VS Congress: ఆసుపత్రికి వచ్చిన మహిళలపై అత్యాచారం..ఆ రాజకీయ నేత భాగోతం ఇదే…





