
YS Bharathi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షంలో వైసిపి పార్టీ కూర్చున్నప్పటికీ.. అడుగడుగున కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఏమాత్రం… చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఛాన్స్… కౌంటర్ ఇస్తూనే ఉంది. అయితే దానికి తగ్గట్టుగానే వైసిపి నేతలను ఇరుకున పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా పనిచేస్తోంది.
Jagan’s shocking decision YS Bharathi as CM
గతంలో జరిగిన స్కాం లను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, జోగి రమేష్, వల్లభనేని వంశీ లాంటి బడా లీడర్లను జైలుకు పంపింది కూటమి ప్రభుత్వం. ఇక త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కూడా జైలుకు పంపిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని అంటున్నారు. సరిగ్గా ఎన్నికల సమయానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడు అని కూడా చర్చ జరుగుతుంది.
Also Read: OG Movie: దర్శకుడు సుజీత్పై పవన్ కళ్యాణ్ ఫైర్…స్టేజి పైనే ?
అయితే.. ఇది ముందే గ్రహించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో స్కెచ్ వేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. తనను జైలుకు పంపిస్తే వెంటనే సీఎం అభ్యర్థిగా వైఎస్ భారతిని రెడీ చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ఇప్పటికే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వైఎస్ భారతిని…. సీఎం చేయాలని జగన్ అనుకుంటున్నారట. తాను నిజంగానే జైలుకు వెళ్తే.. వైయస్ భారతి…. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయితే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ భారతి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైసిపి శ్రేణులు కూడా అంటున్నాయి.
Also Read: IND VS PAK: ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్?





