
Congress: కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము రూ.1000 కోట్లు ఇవ్వాల్సిందేనని అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిధులు సమకూర్చాలని ఢిల్లీ భేటీలో రేవంత్, మంత్రులకు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశారట. కేరళ ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్క మంత్రి రూ. 50 కోట్ల పైనే సేకరించాలని టార్గెట్ ? చేశారని అంటున్నారు. Congress
Congress Telangana’s money for Kerala elections
దాదాపు రూ. 800 నుంచి 1000 కోట్లు అవసరం అవుతాయని తేల్చేశారట కాంగ్రెస్ పెద్దలు. కేరళ ఎన్నికల కోసమే సీఎం, మంత్రులు, కీలక కాంగ్రెస్ నాయకులతో అధిష్టానం భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా నిర్ణయించిందట అధిష్టానం. Congress
Also Read: Chandrababu Naidu: దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ నిరసనలు.. చంద్రబాబు ఘాటు విమర్శలు
ఇప్పటికే తన సొంత ఛానల్ ని కేరళలో కూడా రేవంత్ రెడ్డి మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో గ్రూపు రాజకీయాలతో నిధులు కష్టమని..తెలంగాణపై కన్నేసింది కాంగ్రెస్. తెలంగాణ ప్రజాధనాన్ని ఎన్నికల ఖర్చు కోసం ఏటీఎంలా వాడేస్తున్నాడు రాహుల్ గాంధీ. మొన్న మహారాష్ట్ర, బీహార్.. నేడు కేరళ.. ఎన్నికలు ఏవైనా తెలంగాణ ఖజానాకే గండి పెట్టినట్లు సమాచారం. Congress
Also Read: Gandhi Bhavan: గాంధీ భవన్ ముట్టడి: బీజేపీ కార్యకర్తల అరెస్ట్.. హైదరాబాద్ లో టెన్షన్!!





