RTC: తెలంగాణ బస్ భవన్‌ను ఆక్రమించిన ఐటీ, జీఎస్టీ అధికారులు

RTC: తెలంగాణ బస్ భవన్‌ను ఐటీ, జీఎస్టీ అధికారులు ఆక్రమించారు. ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ బీఆర్ ఎస్ పార్టీ నేత‌లు సీరియ‌స్ అవుతున్నారు. బస్ భవన్‌లో నాలుగు ఫోర్లలో ఉన్న ఆర్టీసీ తాళాలు పగలగొట్టి, వారి తాళాలు వేసుకుని స్వాధీనం చేసుకున్నారు ఐటీ, జీఎస్టీ అధికారులు. RTC

IT and GST officials occupy Telangana Bus Bhavan RTC

అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తమకు నాలుగు ఫ్లోర్లను కేటాయించిందంటుని అధికారులు వెల్ల‌డిస్తున్నారు. ఏ బ్లాక్ లో ఉన్న నాలుగు ఫ్లోర్లు స్వాధీనం చేసుకున్నారు.. సీఎస్ జీవో ఇచ్చారని సమాచారం అందుతోంది. RTC

Also Read: RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి

ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కాకముందే ప్రభుత్వం ఆధీనంలోకి బస్ భవన్, ఆర్టీసీ ఆస్తులు రానున్నాయి. ఉద్యోగులు, ఆర్టీసీ ఆస్తులన్నీ కార్పొరేషన్ కింద ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు కార్మిక సంఘాలు. ఈ నిర్ణయంపై నేడే పెద్ద ఎత్తున సమావేశం కానున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాలు. RTC

Also Read: Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

Share your love