
Pallapu Suresh Kumar : పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ బండారం బట్టబయలు అయింది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విచారణలో నిజం తేలింది. సూర్యాభాయ్ ధరించే ఆభరణాలు అన్నీ రాగితో చేసి రోడియం పూత వేసినవని, వాటి విలువ కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని తేల్చారు అధికారులు. Pallapu Suresh Kumar
Suryabhai alias Pallapu Suresh Kumar Bandaram of Old Basti exposed
ఒక్క ఆభరణానికి మాత్రమే వెండిపై బంగారు పూసినట్లు గుర్తించారు అధికారులు. ధనవంతుడిగా కనిపించేందుకు సుమారు 32 రకాల నకిలీ ఆభరణాలను వాడినట్లు విచారణలో వెల్లడించారు. సొంత ఇల్లు లేక రూ.20 వేల కిరాయికి అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు. Pallapu Suresh Kumar
Also Read: KCR: త్వరలోనే కెసిఆర్ బహిరంగ సభ.. జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్?
గత ఆరేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా, కేవలం 2022-23లో రూ.4.9 లక్షల ఆదాయం చూపాడు సూర్యాభాయ్. ప్రజల్లో గుర్తింపు, సినిమా అవకాశాలు పొందాలనే ఉద్దేశంతోనే ఇలా ‘గోల్డ్ మ్యాన్’గా ప్రచారం చేసుకున్నానని విచారణలో వెల్లడించాడు. కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా వెలుగులోకి సూర్యాభాయ్ భాగోతం పడినట్లు తెలుస్తోంది. Pallapu Suresh Kumar
Also Read: Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా


