Telangana: తెలంగాణ మంత్రివర్గం నుంచి ఆ నలుగురు ఔట్..?

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రివర్గం నుంచి ఆ నలుగురు ఔట్ కానున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ మంత్రివర్గం నుంచి జూపల్లి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను తప్పించే అవకాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Telangana

Those four are out of the Telangana cabinet

ఆ నలుగురి స్థానంలో రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, మహేశ్‌కుమార్, మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంద‌ట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇక పీసీసీ చీఫ్‌గా మంత్రి శ్రీధర్ బాబుకి ఛాన్స్ ఇవ్వ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అటు హోంమంత్రిగానూ అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తోంద‌ట కాంగ్రెస్ అధిస్టానం. కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకోవచ్చని వార్తలు వ‌స్తున్నాయి.. AICC ప్రధాన కార్యదర్శిగా పొన్నంకు ఛాన్స్ ఇవ్వ‌నున్నార‌ట‌. Telangana

Also Read: WPL 2026 Schedule: WPL 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది..ఉచితంగా ఇలా చూడండి

మరో వారం లేదా పది రోజుల్లోనే.. తెలంగాణ మంత్రివర్గ పురర్వ్యవస్థీకరణ ఉండొచ్చని లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో జూపల్లి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. ఇక ఈ జూపల్లి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప‌ద‌వులు పోతున్న వార్త‌లు రావ‌డంతో, వాళ్ల స్థానాల కోసం కాంగ్రెస్ పోటీ విప‌రీతంగా పెరిగింది. అధిష్టానాన్ని మ‌క్కువ చేసుకునే ప్ర‌యత్నంలో ఆశా వాహులు ఉన్నారు. Telangana

Also Read: KCR: వైసీపీ-BRS మధ్య రాజకీయ పొత్తు.. కేసీఆర్ 3.0 లోడింగ్?

https://www.facebook.com/photo/?fbid=122162822480787080&set=a.122099254844787080

Share your love