
Telangana Wines: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల మధ్య పొంతన కుదరడం లేదు. ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. తెలంగాణ కేబినెట్ లో మంత్రులు ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. కమిషన్ల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నట్లు మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. Telangana Wines
Telangana Wines open at 1 pm from now on
ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. తెలంగాణ ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి కావాలంటూ నిత్యం ప్రెస్ మీట్ పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలపై కూడా కొత్త రూల్ తీసుకువచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీంతో ఇక నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టారు. Telangana Wines
Also Read: PM MODI: భారత పౌరులకు బిగ్ షాక్..ప్రధాని మోదీ అతిపెద్ద కుట్ర..?
గతంలో టెండర్ల సమయంలో చెప్పినట్టుగానే, మద్యం దుకాణాల సమయాల్లో, నడిపే విధానాల్లో కీలక మార్పులు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంటల తరువాతే తెరుచుకోనున్న వైన్స్ షాపులు, సాయంత్రం 6 గంటల తరువాతే పర్మిట్ రూంలోకి ప్రజలను అనుమతించనున్నారు వైన్స్ షాపుల యజమానులు. తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు ఎలా ఉన్నా, తన నియోజకవర్గంలో తాను పెట్టిన నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని హుకుం జారీ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Telangana Wines
Also Read: Komatireddy Venkat Reddy: సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు





