
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు నాగబాబు సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. తాజాగా జనసేన పార్టీ నేతలతో నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధిపై కీలక చర్చ చేశారట నాగబాబు. Nagababu
A blow to Jana Sena Nagababu emotional decision
ఎమ్మెల్సీ హోదాలో ఆయన తొలిసారిగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఇకపైన తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ఈ సందర్భంగా కార్యకర్తలతో తెలిపారట నాగబాబు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంటే మొన్న 2024 సంవత్సరంలోనే పోటీ చేసే వాడినని తెలిపారట నాగబాబు. కానీ పార్టీ అభివృద్ధి కోసం తాను పోటీ చేయలేదని వివరించారు. ఇక ముందు కూడా ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. Nagababu
Also Read: Kadiyam Srihari: స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరికి జనాలు షాక్ ?
పార్టీ పదవుల కంటే జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు సాధారణ కార్యకర్తగా పనిచేస్తానని స్పష్టం చేశారట నాగబాబు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చారట. అయితే ఎమ్మెల్సీ లాంటి పదవులను ఆయన తీసుకునే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఆయనకు మంత్రి పదవి కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. Nagababu
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ..టీడీపీ కార్యకర్తల దాష్టీకం





