
Marriage To Idols: 22 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ ప్రేమజంటకు తాజాగా పెళ్లి చేశారు కుటుంబ పెద్దలు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. Marriage To Idols
Marriage To Idols On Sri Rama Navami At Mahabubabad
22 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది ఓ ప్రేమజంట. అయితే, శుక్ర వారం శ్రీరామ నవమి నాడు విగ్రహాలకు పెళ్లి చేశారు తల్లిదండ్రులు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో 22 ఏళ్ల క్రితం, తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకున్నారు రామ్ కోటి, అతని ప్రియురాలు. Marriage To Idols
Also Read: VIJAY THALAPATHY : రజినీకాంత్ ను బెదిరించిన డీఎంకే.. టీవీకే నేత కామెంట్స్ వివాదస్పదం..!
ఇక కొడుకు మరణం తట్టుకోలేక ఇంటి ఆవరణలో అతనికి గుడి కట్టాడు. అందులో కొడుకు అతని ప్రియురాలు విగ్రహాలు ఏర్పాటు చేశాడు తండ్రి. దీంతో ప్రతీ శ్రీరామ నవమికి వారి విగ్రహాలకు వివాహం రామ్ కోటి తల్లిదండ్రులు జరిపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.Marriage To Idols





